హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య (ఏఐఎఫ్ఓఎఫ్)ప్రధాన కార్యదర్శిగా ఎండీ మౌజం అలీఖాన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మౌజం అలీఖాన్ కామారెడ్డి జిల్లాకు చెందినవారు. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మౌజం అలీఖాన్ ఎన్నికవడం పట్ల అటవీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఎండీ మౌజం అలీఖాన్ మాట్లాడుతూ తెలంగాణ అటవీశాఖ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెబుతానని తెలిపారు. తెలంగాణకు హరితహారంపై విసృ్తత ప్రచారం చేస్తానని చెప్పారు. హరిత నిధి అంశం చరిత్రాత్మకమైనదని కొనియాడారు. రాష్ట్రంలో అర్బన్ పార్కులు, హరిత వనాల అభివృద్ధి మంచి ఫలితాలను ఇస్తున్నదని చెప్పారు. అటవీ అధికారులు, ఉద్యోగుల ప్రమోషన్లు, సమస్యల పరిషారం, హకుల సాధనకు కృషిచేస్తానని మౌజం అలీఖాన్ పేరొన్నారు.