హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో భారీగా అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్వోలకు స్థానచలనం కలిగింది. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్వో) సునీల్ ఎస్ హీరేమత్, పంచాయతీరాజ్శాఖ జేసీగా (డీసీఎఫ్) ప్రదీప్కుమార్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లిలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్)గా ప్రవీణ, సిద్దిపేట డీఎఫ్వోగా కే శ్రీనివాస్, హన్మకొండ-జనగామ డీఎఫ్వోగా జే వసంత, ములుగు డీఎఫ్వోగా కిష్టాగౌడ్, యాదాద్రి భువనగిరి డీఎఫ్వోగా పద్మజారాణి, నిజామాబాద్ డీఎఫ్వోగా వికాస్ మీనా, రంగారెడ్డి డీఎఫ్వోగా జాదవ్ కిషన్, నాగర్కర్నూల్ డీఎఫ్వోగా జీ రోహిత్, మంచిర్యాల డీఎఫ్వోగా శివ్ అశీష్ సింగ్, ఖమ్మం డీఎఫ్వోగా సిద్దార్థ్ విక్రమ్సింగ్, సంగారెడ్డి డీఎఫ్వోగా సీ శ్రీధర్రావు, చార్మినార్ సర్కిల్ ఫ్లయింగ్ స్కాడ్ డీఎఫ్వోగా వీ వెంకటేశ్వరరావు, మున్సిపల్శాఖ అడిషనల్ డైరెక్టర్గా ఎం అశోక్కుమార్, అమనగల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా వేణుమాధవరావు, వికారాబాద్ డీఎఫ్వోగా డీవీ రెడ్డి, సూర్యాపేట డీఎఫ్వోగా వీ సతీశ్కుమార్, సూర్యాపేట డీఎఫ్వో ముకుంద్రెడ్డిని ఎక్సైజ్శాఖలో డీసీఎఫ్గా నియమించారు. అరణ్య భవన్లో డీసీఎఫ్ (ఐటీ)గా శ్రీలక్ష్మిని నియమించారు. మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న శివాని డోగ్రా పీసీసీఎఫ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.