హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో వినూత్న ఆలోచనలకు పట్టంకట్టేందుకు ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టాఫే) శ్రీకారం చుట్టింది. మాస్సే ఫెర్గూసన్ డైనాట్రాక్ ట్రాక్టర్ కొత్త డిజైన్ సృజనాత్మక ఆలోచనలపై రైతులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, విద్యార్థులు, విద్యావేత్తలకు మాస్సే డైనాస్టార్-2023 పోటీలను నిర్వహిస్తున్నట్టు టాఫే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పోటీలో పాల్గొనాలనుకునే వారు MasseyFergusonIndia.com/DYNASTAR వెబ్సైట్లో ఈ నెల 27 వరకు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. విజేతకు రూ.7.5 లక్షల విలువైన మాస్సే డైనాట్రాక్ ట్రాక్టర్ను అందజేస్తామని తెలిపింది.