హైదరాబాద్, జనవరి 27: ఇమామ్లు, మౌజంల గౌరవవేతనాన్ని పెంచాలని సీఎం కేసీఆర్కు వక్ఫ్బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇమామ్లు, మౌజంలకు గౌరవవేతనాన్ని అందిస్తున్నదని, ఆ మొత్తాన్ని పెంచాలని కోరారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆడిట్ వివరాలు సమర్పించండి..
రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ మేనేజింగ్ కమిటీలు, మసీదుల ముతావలీస్, ప్రెసిడెంట్లు నిధుల ఖర్చుకు సంబంధించిన ఆడిట్ వివరాలు వెంటనే సమర్పించాలని వక్ఫ్బోర్డు ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిధుల ఆడిటింగ్ కచ్చితంగా నిర్వహించాలని, ఆ వివరాలు వెంటనే బోర్డుకు సమర్పించాలని సూచించింది.