మునుగోడు : మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి సబ్బండవర్ణాలు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నాయి. శనివారం మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం మండలంలోని రాంరెడ్డి పల్లి శివార్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు జగన్ తదితరుల సమక్షంలో సమేళానాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సమ్మేళనంలో పాల్గొన్న మున్నూరు కాపు పెద్దలు, మహిళలు, యువకులు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నినాదాలు చేశారు. గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వివరించారు. ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, అందుబాటులో ఎరువులను ఉంచి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు .
ఈ సమ్మేళనంలో ఇబ్రహీం పట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, మున్నూరుకాపు ప్రముఖులు సర్దార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్, బండి సంజీవ్, విష్ణు జగతి, వాసుదేవుల వెంకటనర్సయ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, వనమాల ప్రవీణ్,గుండ్లపల్లి శేషగిరిరావు, ఉప్పు సత్యనారాయణ, పర్వతం సతీష్, వాసాల వెంకటేష్, కోట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.