రామడుగు, మే 20: క్షణికావేశానికి నిండు ప్రాణం బలైంది. చిన్నపాటి గొడవలకే ప్రాణాలు తీసుకొంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో మామిడికాయ తొక్కు పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొన్నది. ఎస్సై సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్రావుపేటకు గ్రామానికి చెందిన ఇరుకు తిరుపతి – సాయిప్రియ(28) దంపతు లు. గురువారం రాత్రి మామిడికాయ తొక్కు పెట్టే విషయంలో వీరిమధ్య గొడవ జరిగింది. వంటగదిలోకి వెళ్లిన సాయిప్రియ క్షణికావేశంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే భర్త తిరుపతి కు టుంబసభ్యుల సాయంతో ఆమెను కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.