హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డిని ఆరేండ్లపాటు బహిష్కరిస్తూ ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కమిటీ అధ్యక్షుడు జీ చిన్నారెడ్డి శనివారం ఆదేశాలు జారీచేశారు. శశిధర్రెడ్డి పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా శుక్రవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్షాతో ఆయన భేటీ కావటంతో వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. శనివారం ఢిల్లీలో మర్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు క్యాన్సర్ సోకిందని, నయం చేయలేని ప్రమాదకర పరిస్థితికి చేరిందని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పనైపోయిందని..టీఆర్ఎస్ను ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వివరించారు. కాంస్న్రు రేవంత్రెడ్డి నాశనం చేస్తున్నాడని, అసెంబ్లీ ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని సొంత దుకాణం పెట్టే ప్లాన్లో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెంచాగాళ్లను పెట్టుకొని పార్టీని నడుపుతున్న రేవంత్ వ్యవహార శైలిపై మూడు నెలల కిందటే అధిష్ఠానానికి లేఖ రాసినా చర్యలు తీసుకోకపోవటంతో పార్టీ మారాల్సి వస్తున్నదని స్పష్టంచేశారు.