హిమాయత్నగర్, నవంబర్ 15: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైద్య ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 21న ఢిల్లీలో కవాతు నిర్వహించనున్నట్టు తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుకిరణ్, రాజుభట్ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ వైద్య రంగంపై కేంద్రం వివక్ష చూపిస్తున్నదని, పెంచిన మందుల ధరలను తగ్గించాలని, వైద్య పరికరాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు కొత్త లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని అన్నారు. యూనియన్ నాయకులు సునీల్కుమార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.