హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు మంత్రుల నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్ర మరాఠా మండల్ ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల భూమి మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలో స్థిరపడిన మరాఠాలను గుర్తించి తగిన గౌరవాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని మరాఠా మండల్ ప్రతినిధులు పేర్కొన్నారు. సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్కు కూడా మరాఠా మండల్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. వినోద్ కుమార్ను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ అధ్యక్షుడు ప్రకాష్ పాటిల్, ఉపాధ్యక్షుడు నివాస్ నికం, కార్యదర్శులు మదన్ జాదవ్, ఎల్కే షిండే, తదితరులు ఉన్నారు.