హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖలో డైరెక్టర్గా సింగరేణి డీజీఎం (మార్కెటింగ్) మారపల్లి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బొగ్గు గని అధికారుల సంఘం(సీఎంవోఏఐ) ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లును సన్మానించారు. అనంతరం సింగరేణి జీఎం (మార్కెటింగ్) కే రవిశంకర్ మాట్లాడుతూ.. మారపల్లి ఎంతో పట్టుదలతో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారని తెలిపారు. కార్యక్రమంలో బొగ్గు గని అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖరరావు, డీజీఎం సత్తు సంజయ్, చీఫ్ లైజాన్ ఆఫీసర్ బీ మహేశ్, ఎస్వోఎం కృష్ణమాచారి, అడిషనల్ మేనేజర్లు వెంకటేశం, మహేందర్రెడ్డి, ఎస్ఈలు సంజీవరెడ్డి, చిన్ని కృష్ణ పాల్గొన్నారు.