హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్రం అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్ ఎన్నికయ్యారు. సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీజ్ హుస్సేని తదితరులు జగదీశ్వర్ను శాలువాతో సన్మానించారు.