భద్రాద్రి కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతప్పగూడెంలో వంతెన పనులు జరుగకుండా వాహనాలను తగులబెట్టారు. ప్రొక్లయినర్, కాంక్రీట్ మిక్సర్తో పాటు నాలుగు టాక్టర్లను తగులబెట్టారు. మరో మూడు వాహనాలను అపహరించుకుపోయారు. వంతెన పనులు పూర్తయితే తమ ఉనికి ప్రమాదమని భావించి పనులు జరుగకుండా వాహనాలను తగులబెట్టినట్లు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా.. గత జనవరిలోనూ ఛత్తీస్గఢ్లో మావోలు బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో 12 వాహనాలనుకు నిప్పుపెట్టారు. రోడ్డు పనులను చేస్తున్న సిబ్బందిని సైతం చితకబాదిన విషయం తెలిసిందే.