పెద్దపల్లి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాలరావు మాతృమూర్తి మధురమ్మ (100) మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలోని తన నివాసంలో కన్నుమూసింది. మధురమ్మకు ముగ్గురు కుమారులు.
1973లో రెండో కొడుకు కోటేశ్వర్రావు, 1977లో చిన్నకొడుకు వేణుగోపాల్రావు నక్సల్స్ పంథాను ఎంచుకొని అడవిబాట పట్టారు. 1997లో తండ్రి మరణించినా అంత్యక్రియలకు రాలేదు. 2011లో జరిగిన ఎన్కౌంటర్లో కోటేశ్వర్రావు అలియాస్ కిషన్జీ మృతి చెందిన విషయం తెలిసిందే.