కొత్తగూడెం క్రైం, ఆగస్టు 21: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అడవుల్లో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత హతమయ్యాడు. నారాయణ్పూర్ జిల్లా ఓర్చా పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్ బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో భట్బేడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు పారిపోయారు. ఈ ఘటనలో మావోయిస్టు మృతదేహంతోపాటు 315 బోర్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్టు నారాయణ్పూర్ ఏఎస్పీ నిఖిల్ రకోచా వెల్లడించారు.