హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు దంపతులను మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన మధుకర్ అలియాస్ తుగే, అతని భార్య శ్యామల అలియాస్ జమాని 2006లో అక్కడ ఉద్య మాన్ని విడిచిపెట్టి తెలుగు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. హైదరాబాద్లో ని ఓ కంపెనీ వాచ్మన్గా మధుకర్ పనిచేస్తుండగా.. ఆయన భార్య శ్యామల ఒక మెకానిక్ షోరూమ్లో స్వీపర్గా పనిచేస్తున్నది. మొదట్నుంచీ వారి కదలికలపై నిఘా పెట్టిన మహారాష్ట్ర పోలీసులు సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ మావోయిస్టు దంపతులు ఒక్కొక్కరి తలపై రూ.కోటి రివార్డు ఉండగా.. అరెస్టు చేస్తే రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు మహారాష్ట్ర పోలీసులు. మధుకర్పై 9 హత్యలు, 8 ఎన్కౌంటర్లు, 2 దోపిడీలు, 4 దహనాలు, ఒక హత్యాయత్నం కేసు ఉండగా.. శ్యామలపై ఒక హత్యకేసు, ఐదు ఎన్కౌంటర్లు, ఒక దహనం, ఒక దోపిడీ కేసు సహా మొత్తం 9 తీవ్రమైన నేరాలు నమోదయ్యాయి.