హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా మహోన్నతమైనదని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ పీఠిక మన దేశ ఔన్నత్యానికి ప్రతీకని, ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో విశిష్టమైనదని పేర్కొన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవాన్ని కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్ (సెక్రటేరియట్)లో జరిగిన కార్యక్రమంలో జీఏడీ సెక్రటరీ వీ శేషాద్రి ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జీఏడీ అడిషనల్ సెక్రటరీ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని సింగరేణి భవన్లో శనివారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. జీఎం సురేశ్ సింగరేణిభవన్లోని ఫైనాన్స్, పర్చేజ్, ఐటీ, సేల్స్ తదితర విభాగాలను సందర్శించారు. అక్కడి పనులపై సమీక్షించారు. కార్యక్రమంలో బొగ్గు గనుల అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్వీ రాజశేఖర్రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాసర్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోని అన్నివర్గాల సమున్నతికి, హకులు, ప్రయోజనాల విషయంలో భరోసా కల్పించేలా రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేదర్ తీర్చిదిద్దారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే కిశోర్గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.