హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ (ఐసీఎస్ఈ), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్సీ) ఫలితాల్లో పలువురు హైదరాబాద్ విద్యార్థులు అత్యత్తమ ప్రతిభను సాధించారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) నూరుశాతం ఉత్తీర్ణతను నమోదుచేసింది.
ఐఎస్సీ ఫలితాల్లో శ్రీ రజిత వల్లూని కామర్స్ స్ట్రీమ్లో 500 మార్కులకు 483 మార్కులు (96.6శాతం) సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. హ్యుమానిటీస్లో లక్ష్మీసంజన 500 మార్కులకు 477 మార్కులు, శ్రీనిధి కామర్స్లో 475 మార్కులు, మైథిలీనంద సైన్స్లో 472 మార్కులు సాధించారు. ఐసీఎస్ఈ ఫలితాల్లో సార్థక్ 594 మార్కులు, అధ్య 593 చొప్పున మార్కులు సాధించారు.