హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మహబూబ్నగర్ డీఈవో ఎస్ యాదయ్యను బదిలీచేసి మంచిర్యాల డీఈవోగా నియమించగా, అక్కడున్న ఎస్ వెంకటేశ్వర్లుకు సంగారెడ్డి డీఈవోగా పోస్టింగ్ ఇచ్చారు.
వనపర్తి డీఈవో ఏ రవీందర్కు మహబూబ్నగర్ జిల్లా డీఈవోగా బాధ్యతలప్పగించారు. నాగర్కర్నూల్ జిల్లా డీఈవోగా పనిచేస్తున్న ఏ గోవిందరాజును వనపర్తి డీఈవోగా అదనపు బాధ్యతలప్పగించారు.