కృష్ణ కాలనీ, ఫిబ్రవరి 3: జర్నలిజం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ రెడ్డి బిడ్డలను అగౌరవపరిచిన చింతపండు నవీన్కుమార్ గత చరిత్ర ఏంటో తమకు తెలుసని రెడ్డి సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు గోలి దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. జర్నలిజం పేరిట అనేక ఆకృత్యాలకు పాల్పడినట్టు విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలకు వంతపాడుతూ కొంతమంది విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడతాడని ఆరోపించారు.
అమాయకులైన బీసీలను ప్రలోభాలకు గురిచేస్తూ మోసపూరితమైన మాటలు చెప్తూ పబ్బం గడుపుకొనే నీచమైన సంసృతి ఆయనదని మండిపడ్డారు. సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు తుమ్మేటి రామ్రెడ్డి, మోహన్ రెడ్డి, పాడి మహేందర్రెడ్డి, పాడి బుచ్చిరెడ్డి, లింగాల రమణారెడ్డి, బుద్దిరెడ్డి మధుకర్ రెడ్డి, రఘునాథరెడ్డి, పోలాల రమణారెడ్డి, రెడ్డి పరపతి సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు బిల్లా రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.