రాంనగర్ : మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు గన్మ్యాన్ మల్లయ్య అదృశ్యమయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించడం లేదు. ఈ మేరకు మల్లయ్య భార్య హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
1996 వ బ్యాచ్కు చెందిన మల్లయ్య.. ప్రస్తుతం రామగుండం కమిషనరేట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వద్ద గన్మ్యాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన మల్లయ్య.. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బయటకు వెళ్లాడు. బ్యాంకులో పని ఉందని చెప్పి బయటకు వెళ్లిన మల్లయ్య రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక శనివారం సాయంత్రం వరకు కూడా మల్లయ్య ఆచూకీ కనిపించకపోవడంతో అతని భార్య హేమలత.. లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.