హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో మమ్మాడ్, ముద్కేడ్, డోన్ తదితర రైల్వేస్టేషన్ల మధ్య వందశాతం విద్యుద్దీకరణ పనులను పూర్తి చేసినట్టు శుక్రవారం రైల్వే అధికారులు వెల్లడించారు. మన్మడ్-ముద్కేడ్ మధ్య మొత్తం 43 కిలోమీటర్ల మేర ఈ పనులు పూర్తయ్యాయని తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి మధ్య కొనసాగుతున్న నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా గుండ్లకమ్మ-దర్శి మధ్య పనులు కూడా పూర్తయ్యాయని వారు తెలిపారు.