హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా మంజువాణి నియమితులయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ రాంచందర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ రాంచందర్ను టీఎస్ఎల్డీ సీఈవోగా నియమించింది. అయితే ఆకస్మిక బదిలీలపై ఆ శాఖలో జోరుగా చర్చ జరుగుతున్నది. మే నెలలో మంజువాణి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొద్దికాలానికే రెగ్యులర్ డైరెక్టర్ను బదిలీ చేసి ఆమెను నియమించడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. రాంచందర్ ఆకస్మిక బదిలీని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా ఖండించారు.