యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్ దర్శించుకుని సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన హరిత హోటల్ కు బయలుదేరారు. ఆదివారం ఉదయం స్వామివారి అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, మున్నూరు కాపు సత్రంలో జరిగే హోమం లో పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది