గర్మిళ్ల, ఆగస్టు 5 : దొంగతనానికి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు.. యజమానిని చూసి పారిపోతున్న క్రమంలో అందులోని ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందా డు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం లో శనివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా వద్ద నివాసం ఉండే జనార్దన్ 3వ తేదీన ఉదయం టిఫిన్ చేసేందుకు బయటకు వెళ్లాడు. అదే సమయంలో సిర్పూర్ కాగజ్నగర్కు చెం దిన మనోజ్, మందమర్రి మండలం నార్లాపూర్కు చెందిన మహేశ్.. జనార్దన్ ఇంటి ఆవరణలో ఇనుప రాడ్లు, పైపులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో జనార్దన్ ఇంటికి వచ్చాడు. అతడిని గమనించిన వారు పారిపోయేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో మహేశ్ను స్థానికుల సహాయంతో పట్టుకొని చితకబాదారు. మరో వ్యక్తి మనోజ్ పారిపోయే క్రమంలో ఇంటి ఆవరణలో మంచినీళ్ల బావి గోడ ఎక్కాడు. అదుపు తప్పి బావిలో పడిపోయాడు. ఈ విషయాన్ని జనార్దన్ గమనించలేదు. గాయపడిన మహేశ్ను స్థానిక ప్రభుత్వ దవాఖాన ఆవరణలో వదిలి పెట్టాడు. శుక్రవారం రాత్రి దుర్వాసన రావడాన్ని గమనించిన జనార్దన్ బావిలోకి తొంగిచూశాడు. అందులో ఓ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. బావిలో నుంచి మనోజ్ మృతదేహాన్ని బయటకు తీసి మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జనార్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేందర్ తెలిపారు.