హైదరాబాద్ : మంచిర్యాల ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఇంట్లో ముగ్గురికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే దివాకర్రావుతో పాటు ఆయన భార్య, కోడలుకు వైరస్ సోకినట్లు గుర్తించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో ఇంట్లోనే ఉండి వారంతా చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మరో వైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,047 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ సోకి ముగ్గురు మృతి చెందగా.. మహమ్మారి నుంచి 2,013 మంది కోలుకున్నారు. ఇవాళ 55,883 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వివరించింది.