కమలాపూర్, ఆగస్టు 14: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు బీజేపీ ఉచ్చులో పడొద్దని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూ చించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో శనివారం ఆయన మా ట్లాడుతూ.. బీజేపీ మూలమే దళిత వ్యతిరేకమన్నారు. ఆలయాల్లోకి దళితులు రాకుండా సామాజిక వివక్షతో ఊరికి దూరం పెట్టిందే బీజేపీ అని మండిపడ్డారు. అలాంటి బీజేపీ ఉచ్చులో పడి దళితబంధుపై ఆందోళనలు చేయొద్దని సూచించారు. దళితబంధుపై దళితుల్లో విషబీజాలు నాటేందుకు బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పథకం ఒక విప్లవమని, తెలంగాణలో అమలైతే దేశంలో అమల య్యే అవకాశం ఉన్నదన్నారు. బీజే పీ నాయకులు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. సోమవా రం శాలపల్లిలో జరిగే ముఖ్యమంత్రి సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సభలో సీఎం కేసీఆర్ 15 కుటుంబాలకు దళితబంధు సహా యం అందజేసి, పథకాన్ని స్పష్టం గా వివరిస్తారని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.2 వేల కోట్లు కేటాయించారని, 20 వేల కుటుంబాలకు యూనిట్లు వస్తాయని పేర్కొన్నారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇంచార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.