మంచిర్యాలకు చెందిన 14 ఏండ్ల బాలిక పులకిత హస్వి పలు పర్వతాలను అధిరోహించి ప్రశంసలు అందుకుంటున్నది. వజ్రోత్సవాల వేళ ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ను సోమవారం తెల్లవారుజామున అధిరోహించి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
రష్యా-జార్జియా సరిహద్దులో, సముద్రమట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో గల ఎల్బ్రస్ శిఖరాగ్రాన్ని అధిరోహించింది. తన బృందంతో కలిసి కేవలం 24 గంటల్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సాహసయాత్రను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు సాధించింది.
– మంచిర్యాల, నమస్తే తెలంగాణ