అచ్చంపేట, డిసెంబర్ 12 : కాంగ్రెస్ గ్యా రెంటీ కార్డుల పేరుతో ఓ కంప్యూటర్ సెం టర్ నిర్వాహకుడు ప్రజలను మోసం చేస్తున్నాడు. కొన్ని రకాల కార్డులను ముద్రించి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నాడు. ఈ తతంగం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట లో మంగళవారం వెలుగుచూసింది.
అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లే రోడ్డులో ఉన్న లక్ష్మీ కంప్యూటర్ సీఎస్సీ సెంటర్ నిర్వాహకుడు కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో బోగస్ కార్డులు ముద్రించాడు. వీటి ని సామాన్యులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. కొందరి వద్ద రూ.50 చొప్పు న, మరికొందరి వద్ద రూ.300 వరకు వసూ లు చేసినట్టు సమాచారం. బోగస్ అని తేలడంతో మా డబ్బులు మాకివ్వాలంటూ బాధితులు ఒత్తిడితేగా తప్పించుకున్నాడు.