మెదక్: జిల్లాలోని తూప్రాన్ మండలంలో 90 శాతం కాలిన గాయాలతో పడి ఉన్న యువకుడిని స్థానికులు గుర్తించారు. మండలంలోని రావెల్లి గ్రామ శివార్లలో ఉన్న పోలం వద్ద ఓ యువకుడు పూర్తిగా కాలిపోయి పడి ఉన్నాడు. శనివారం ఉదయం అటుగావెళ్లిన స్థానికులు.. అతడిని గుర్తించి హుటాహుటిన తూప్రాన్ ప్రాథమిక కేంద్రానికి తరలించారు. అయితే 90 శాతానికిపైగా శరీరం కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆధారాల కోసం క్లూస్ టీమ్ను రప్పించారు. కాగా, ఆ యువకుడిని చేగుంట మండలంలోని మక్కా రాజుపేటకు చెందిన అనిల్ గౌడ్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారిస్తున్నారు.