హైదరాబాద్ : జైలు నుంచి విడుదలైన అతని బుద్ధి మారలేదు. కారాగారం నుంచి వచ్చిన నెల రోజులు గడవక ముందే మళ్లీ వక్రమార్గం పట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని హత్నూర్ మండలం మల్కార్లో ఉంటున్న బీహార్కు చెందిన ప్రేమ్కుమార్ గంజాయి చాక్లెట్లు(Ganja chocolates) అమ్ముతూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి రూ. 33,200 విలువైన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలను ఎవరైనా సరఫరా చేసినా వినియోగించినా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి చాక్లెట్లు ఎక్కడ తయారవుతున్నాయో నిఘా పెట్టామన్నారు.