యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల వేట కోసం నల్లచెరువుకు వెళ్లిన ముక్కర్ల సత్తయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని చెరువులో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంత ప్రయత్నించినా సత్తయ్య ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. చివరకు శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ రిస్క్ టీం, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యల్లో సత్తయ్య మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని తహసీల్దార్ గణేష్ నాయక్, సీఐ బొడ్డుపల్లి భాస్కర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ సత్యనారాయణ, ఆర్ఐ, పోలీసులు పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీ ఐ భాస్కర్ తెలిపారు చేపల వేటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని చెరువులు, కుంటల్లో చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది.. ఇప్పటికైనా ఎవరైనా నల్లచెరువులో గాని ఏ చెరువులో గాని చాపలు బయటకు వెళ్లొద్దని, వెళ్లినవారు ఒకవేళ ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.