మంచిర్యాల అర్బన్ జూన్ 25 : మంచిర్యాల(Mancherial )జిల్లా కేంద్రంలోని అండాళమ్మ కాలనీ జలగుట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు( Man brutally murdered )గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతానికి చెందిన లాక్పతి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేసినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.