అడ్డగుట్ట, జనవరి 16: పచ్చిమాంసం ఎందుకు తింటున్నావని అడిగిన పాపానికి ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. తుకారాంగేట్ గోల్బావి ప్రాంతానికి చెందిన కాంబ్లే అజయ్ (23) భార్య ప్రియాంక, కుమార్తె అక్షిత (8 నెలలు)తో కలిసి నివాసముంటున్నాడు.
సోమవారం అదే ప్రాంతాని కి చెందిన చారి (43) ఇంటి బయట కూర్చొ ని పచ్చిమాంసం తింటున్నాడు. ఇది గమనించిన అజయ్, ప్రియాంక పచ్చిమాంసం ఎం దుకు తింటున్నావని ప్రశ్నించగా కోపోద్రిక్తుడైన చారి పక్కనే ఉన్న కూరగాయల కత్తితో అజయ్ని కడుపులో పొడిచాడు. అడ్డువచ్చిన ప్రియాంకపై కూడా దాడి కి పాల్పడటంతో స్వల్పంగా గాయపడింది. గాంధీ దవాఖానకు తరలించగా, అప్పటికే అజయ్ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.