పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకు బండరాయితో మోది హతమార్చిన సంఘటన(Brutally Murdered)సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల(Pusala)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన తీగల నరసయ్యను అతడి తనయుడు తీగల రాజేశం హతమర్చాడు. పూసాలలోని ఐకేపీ సెంటర్లో ధాన్యం విక్రయిస్తుండగా తండ్రీ, కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆవేశానికి గురైన రాజేశం బండరాయితో నరసయ్య తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.