హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఇల్లెందు పట్టణంలో భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. పట్టణానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్య జరీనాను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత కూతురు సున్వి (11) గొంతుకోశాడు. దీన్ని గమనించిన స్థానికులు వారిద్దరిని వెంటనే ఇల్లెందులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో తల్లీ కూతురిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.