హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హర్యానాలోని ఫరీదాబాద్లో గత బుధ, గురువారాల్లో జరిగిన ఏఐఎస్జీఈఎఫ్ సమావేశాల్లో తనను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు రాజేందర్ తెలిపారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనట్టు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షుడు ఎం సత్యనారాయణగౌడ్ తదితరులు ఈ సమావేశాలకు హాజరైనట్టు వెల్లడించారు.