హైదరాబాద్, నమస్తే తెలంగాణ/అబిడ్స్, మార్చి 21: కురుమల కోసం ప్రత్యేక కురుమ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ, రాష్ట్రకురుమ సం ఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం కోరారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి, విప్ బీర్ల ఐలయ్యతో కలిసి సీఎం రేవంత్రెడ్డిని మల్లేశం కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమ కార్పొరేషన్ నుంచి కురుమలను వేరు చేసి ప్రత్యేక కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కురుమలు బీసీ బీ జాబితాలోకి వస్తారని, యాదవులు బీసీ డీ జాబితాలోకి వస్తారని తెలిపారు. రాష్ట్రంలో యాదవులతో పోలిస్తే కురుమల జనాభా అధికంగా ఉంటుందన్నారు.