హైదరాబాద్, డిసెంబర్22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గనుల తవ్వకాల కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ చేపట్టే సర్వేక్షణలో బౌద్ధ స్థావరాల ఉనికిని గుర్తించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విజ్ఞప్తి చే శారు. ఈ మేరకు హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ గను ల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావుకు వినతిపత్రం అందజేశారు. బౌద్ధ స్థావరాల ఉనికి గుర్తింపు కోసం భారత భూగర్భ సర్వేక్షణ అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు మండ లం చాడ గ్రామంలో శాతవాహన-ఇక్ష్వాకుల కాలం నాటి సున్నపు రాతి బుద్ధుని బొమ్మలు బయట పడ్డాయని, అకడి పురాతన స్థలం 10 ఎకరాల్లో విస్తరించి ఉన్నదని, ఎంత మేరకు పురాతన కట్టడాలున్నాయో రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కాంతారావు సానుకూలంగా స్పందించారని మల్లేపల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డిజైన్ ఇన్చార్జి, డీఆర్ శ్యాంసుందరరావు తదితరులు పాల్గొన్నారు.