మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 25: ప్రపంచ స్థాయి హాకర్స్ పరీక్ష పోటీలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి టాప్లో నిలిచాడు. ప్రసిద్ధిగాంచిన హ్యాకర్స్ సంస్థ ఎస్ క్యూ ఎల్ సాంకేతిక పరిజ్ఞానంలో సమస్య పరిష్కార పోటీ నిర్వహించింది. ఈ పోటీలో మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాలకు చెందిన ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థి మాచనూరు రవితేజరెడ్డితోపాటు 50మంది పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12,68,900 మంది పోటీపడగా.. రవితేజ గరిష్ఠస్థా యిలో 1,130 పాయింట్ల సాధించి మొదటిస్థానంలో నిలిచాడు. సత్తాచాటిన రవితేజను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామిరెడ్డి అభినందించారు.