హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే కాంగ్రెస్ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) ప్రజలు బీఆర్ఎస్(BRS )వైపే ఉంటారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy )అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయమాటలతో కాలక్షేపం చేస్తుందన ఆరోపించారు.
అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిండం ఖాయమన్నారు.