హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మంత్రి మల్లారెడ్డి బంధువులను సోమవారం ఐటీ అధికారులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. ఇటీవల మల్లారెడ్డితోపాటు ఆ యన కుటుంబీకులు, బంధువుల ఇం డ్లలో సోదాలు చేసిన ఐటీ అధికారులు పలువురికి నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న మర్రి రాజశేఖర్రెడ్డి, భద్రారెడ్డిని తొలిరోజు విచారించింది. విచారణకు మల్లారెడ్డి తనయుడు మహేందర్రెడ్డి హాజరుకాలేదు. విచారణలో భా గంగా సేకరించిన సమాచారం ఆధారం గా ఐటీ అధికారులు మరో 10 మందికి నోటీసులు జారీ చేశారు. విచారణ డిసెంబర్ 5వరకు కొనసాగనున్నది.