చేర్యాల, మార్చి 28 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 11వ ఆదివారం సందర్భంగా రూ.52,13,460 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. సోమవారం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం రూ.2,89,286, ఆదివారం రూ.49,24,174 ఆదాయం స్వామి వారికి ఖజానాకు సమకూరిందన్నారు. 11వ ఆదివారం సందర్భంగా స్వామి వారి ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాలు, దర్శనాలు, కాటేజీలు తదితర వాటి ద్వారా ఆదాయం సమకూరిందన్నారు.