చేర్యాల, మార్చి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 10వ ఆదివారం సందర్భంగా రూ.48,15,116 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం రూ.3,23,290, ఆదివారం రూ.44,91,826తో ఆదాయం స్వామి వారికి ఖజానాకు సమకూరిందన్నారు.
10వ ఆదివారం సందర్భంగా స్వామి వారి ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాలు, దర్శనాలు, కాటేజీలు తదితర వాటి ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. ఆయనతో ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్ తదితరులున్నారు.