చేర్యాల, మార్చి 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను ఈ నెల 29వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కుల రూపంలో చెల్లించుకున్న కానుకలతో ఆలయంలోని పలు హుండీలు నిండిపోయినట్లు తెలిపారు.
కానుకల హుండీలతో పాటు భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన బియ్యం హుండీలను సైతం తూకం వేయనున్నట్లు పేర్కొన్నారు. హుండీల లెక్కింపునకు ఆలయ పాలక మండలి, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్ అధికారులు, సేవా సమితి సంస్థ సభ్యులు సకాలంలో హాజరుకావాలని కోరారు.