హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య గంగపుత్రను ప్రభుత్వం నియమించింది. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. తనను నియమించినందుకు సీఎం కేసీఆర్, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మల్లయ్య ఈ నెల 25న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు.