సారంగాపూర్, సెప్టెంబర్ 7: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మల్లక్చించోలి అట వీ ప్రాంతంలోని రాజన్నలొద్ది వద్ద గురువా రం వేకువజామున చిరుతపులి అప్పుడే పుట్టి న బర్రె దూడను చంపింది. మల్లక్చించోలి గ్రామానికి చెందిన రైతు ప్రశాంత్రెడ్డి బర్రె మే త కోసం బుధవారం అడవిలోకి వెళ్లింది. బర్రె ఇంటికి తిరిగి రాకుండా అడవిలోనే బర్రె దూడకు జన్మనిచ్చింది. అదే ప్రాంతంలో సం చరిస్తున్న చిరుత అప్పుడే పుట్టిన బర్రె దూడ ను చంపేసింది. తలను మాత్రమే తిన్న చిరుత మిగతా భాగాన్ని పక్కనే ఉన్న చెట్టుపైకి తీసుకెళ్లింది. అడుగులను గుర్తించిన అటవీ అధికారులు చిరుత చంపినట్టుగా నిర్ధారించారు.