Minister Niranjan Reddy | నాగర్కర్నూల్ జిల్లాలో జూన్ 6న జరిగే సీఎం సభను విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. ఆరునెలల కార్యాచరణ రూపొందించుకొని బీఆర్ఎస్ తడాఖా చూపించాలన్నారు. మౌనం వీడాలన్నారు. నీటి కరువు, కరెంటు సమస్యలు తీరాయని, మిగతా పనులు నడుస్తున్నాయన్నారు.
నాడు నాగర్ కర్నూల్ జిల్లాగా ఉండేదని, మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాగర్కర్నూల్ను జిల్లా చేశారన్నారు. గతంలో డిగ్రీ కాలేజీ లేదని, పాలెం సుబ్బయ్య డిగ్రీ కాలేజీని తెప్పించారని.. ప్రస్తుతం అగ్రికల్చర్ కాలేజీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలు గులాబీ కండువాలు వేసుకొని ఎన్నికల ప్రచారం తరహాలో ఇంటింటికీ తిరగాలని.. ఊరూరా కదలాలన్నారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నుంచి 50వేల మంది రావాలని, నాకంటే పది ఓట్లు ఎక్కువ వస్తే మర్రికి మొదటి మిఠాయి తానే తినిపిస్తానన్నారు. నియోజకవర్గంలో 43వేలమందికి పింఛన్లు, 85వేల మందికి రైతుబంధు ఇస్తున్నామన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. 3న జరిగే రైతు దినోత్సవంలో క్లస్టర్ పరిధిలోని రైతులను కదిలించాలన్నారు.