కుత్బుల్లాపూర్,ఆగస్టు 5: మహీంద్రా యూనివర్సిటి సాంకేతిక విద్యతో విద్యార్థుల్లో కొత్త జ్ఞానాన్ని నింపే దిశగా ముందుకు సాగుతున్నదని చాన్స్లర్ ఆనంద్మహీంద్రా అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణం గా భవిష్యత్తుతరాలకు దిక్చూచిలా నిలిచేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన మహీంద్రా వర్సిటీ రెండో వార్షిక స్నాతకోత్సవంలో ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, విద్యార్థులు తమ మేధోశక్తిని పెంపొందించేందుకు విశాలమైన ప్రపంచంలోకి అడుగులు వేయాలని సూచించారు.
మన జీవితాలు యంత్రాలతో ఎంతగా పెనవేసుకున్నాయో నిర్ణయం తీసుకొనే దాని నుంచి బయటకు రావాలని చెప్పారు. అప్గ్రాడ్ చైర్మన్ రోనీస్క్రూవాలా మాట్లాడుతూ.. విద్యార్థులు స్పష్టత, అనుసంధానం, నమ్మకం, ఉత్పాదకత, మార్పు, ఎంపిక వంటి ప్రధానాంశలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం ఈ ఏడాది పట్టభద్రులైన ముగ్గురు పీహెచ్డీ, 22 ఎంటెక్, 262 బీటెక్ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అంతకుముందు క్యాంపస్లో లైఫ్ సైన్సెస్ ల్యాబ్ కాంప్లెక్స్, మహీంద్రా ఈ-హబ్లను ప్రారంభించారు. టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ కమిటీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సీపీ గుర్నానీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జున్రావు, టెక్మహీంద్రా ఎండీ,సీఈవో మోహిత్జోషి, వైస్చాన్స్లర్ డాక్టర్ యూజులుమేదురి, విద్యార్థులు పాల్గొన్నారు.