హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 6,212 పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్టు పోస్టల్శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సంతోష్కుమార్ నరహరి సోమవారం తెలిపారు. ఈ పథకం రెండేండ్లపాటు అమలులో ఉంటుందని, మహిళలు లేదా బాలికలు రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని పేర్కొన్నారు. సంవత్సరానికి 7.5% వడ్డీని చెల్లిస్తారని, ఏడాది తర్వాత 40% నగదు వరకు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 20 ఖాతాలు ఓపెన్ అయినట్టు తెలిపారు.