హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress party) నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) హెచ్చ రించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏమైనా అభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా తెలియజేయాలి.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఎంతటి వారు మాట్లాడినా ఉపేక్షించేది లేదన్నారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొంత మంది అసలైన కాంగ్రెస్ నాయకులకు సీఎం కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మీడియా ముందు వాపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తున్నది.